యేసుతో ప్రతి ఉదయము -39 కన్నీటిని తుడుచు ప్రభువు

ఆయన వారి కన్నుల ప్రతి భాష్పభిందువును తుడిచివేయును…. దుఃఖమైనను, ఏడపైనను వేదనైనను ఇక ఉండదు. ప్రకటన 21:4

క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గూర్చిన వివరణ ప్రకటన గ్రంధము యొక్క 21 అధ్యముమందు వ్రాయబడియున్నది. అందువలన అంతవరకు కన్నీళ్లు, ఏడుపు, వేదన, దుఃఖము, మరణము ఉంటుందని గ్రహించుచున్నాము. అయినను ఈ లోకమందు జీవించు చుండగానే ప్రభువు మన కన్నీటిని తుడుచుచున్నాడు అనునది నిజము. బైబిల్ గ్రంధమందలి పరిశుద్దులందరు కన్నీటి మార్గమున నడచిరి. “వారు బాకా లోయలో పడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు ” కీర్తనలు 84:6. బాకా అనగా కన్నీటి లోయ. “కన్నీళ్లు విడుచుచు వితువారు సంతోషాగానము చేయుచు పనలు మోసికొనివచ్చును ” కీర్తనలు 126:5,6 ఇది వారి అనుభవముగా ఉండును.

దేవుని బిడ్డలారా, మీరు కన్నీరు కార్చుచుండగా మీకు ఒక ఆదరణ కలదు. మృత్యుంజయుడై లేచిన క్రీస్తు మీ కన్నీటిని సంపూర్ణముగా తుడిచి వేయును అను నిరీక్షణ కలదు. “సింహాసన మధ్యమాందుండు గొర్రెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నులనుండి ప్రతి భాష్పాభిందువును తుడిచి వేయును “ప్రకటన 7:17

పాత నిభందన గ్రంధమందును ఇందుకు సంబంధించిన ప్రస్తావన ఉన్నది.”మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన తుడుచువేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమిది భాష్పాభిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనుల నిందను తీసివేయును “యెషయా 25:8 దేవుని బిడ్డలారా, సంతోషమును ఓర్వలేని సాతాను అయ్యారితులలో వేదన దుఃఖమును కలుగజేయుచున్నాడు.

లోకమందు జన్మించు ప్రతి మనుష్యుడు ఏడుచుచ్చునాడు, కన్నీరు కార్చుచున్నాడు. అతడు మరణించునప్పుడు బంధు మిత్రులు అతని కొరకు ఏడుస్తున్నారు. ఇలాగునా ఏడుపు, కన్నీరు అనునవి అనుదిన జీవితంలో ఒక భాగముగా ఉన్నది. అదే సమయంలో తన జన్మ, కర్మ పాపములను గ్రహించువాడై పశ్చతపముతో కార్చు కన్నీరు కలదు. నింద, అవమానము వలన, కష్టానష్టముల వలన, వ్యాధి వలన కార్చు కన్నీరు కలదు.

యేసుతో ప్రతి ఉదయము Day-38

యేసుతో ప్రతి ఉదయము :-

ఈరోజు దేవుని వాగ్దానము:-

ఏలయనగ అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను. హెబ్రీ 11:26

ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతడికి ప్రత్యక్షమాయెను. నిర్గమ 3:2

దైవజనుడు మోషే జీవితములో మలుపును తెచ్చిన సంఘటన అందరికి తెలుసు. నిర్గమ 3:24 ఇది ఎప్పుడు జరిగెను.?  మోషే తన మామ మందను మేపుచు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చినప్పుడు జరిగేను.దేవుడు మోషేతో మాట్లాడి తన ప్రజలైన ఇశ్రాయేలి్యులను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించుటకు పంపిన సంగతి మనకు విధితమే. మోషే ఆయుష్కాలము 120 సంవత్సరాలు.  బైబిల్ పండితులు దీనిని మూడు బాగాములుగా విభజించుచున్నారు. మొదటి 40సంవత్సరాలు గొర్రెల కాపరిగా తన మామయగు యిత్రో మందను మేపుచుండెను. ఇలా చాలా విచిత్రంగా ఉన్నది.

దేవుడు ఎప్పుడు, ఎవరిని, ఎలాగు పిలుస్తాడని ఉహించి తెలుసుకొనలేము. ఫరో భవనములో విదలన్నియు నేర్చుకొనిన మోషే ఒక ఐగుప్తుయుని చంపేను. గనుకఐగుప్తును విడిచి పారిపోయెను. 40సంవత్సరాల కాలము గొర్రెలను మేపిన అనుభవము. 40 సంవత్సరాల కాలము దేవుని ప్రజలను అరణ్యములో నడిపించుటకు దోహదపడేను. రాజభవనములో నేర్చుకొన్న సమస్తమును అరణ్యములో గొర్రెలను మోపుచుండగా అతడు మరచిపోయెను.

యేసుతో ప్రతి ఉదయము 37

యేసుతో ప్రతి ఉదయము:-

ఈరోజు దేవుని వాగ్దానము:-

ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. మూలకు తలరాయి ఆయెను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. కీర్తనలు 118:22,23

ఇల్లు కట్టువారు నిర్మాణము కొరకు వాడుతున్న ప్రతి దానిని పరీక్షించి చూచేదరు. ముఖ్యముగా నాణ్యమైన వాటిని ఎన్నుకొనెదరు.  నిర్మాణము కొరకైన రాళ్ల విషయములో కొన్నిటిని నిషేధించుట సహజము. అలాగే నిషేదించబడిన ఒక రాయి కట్టబడు భవనమంతటిని మోయు మూలరాయిగా మారిన పక్షముగా అది నిశ్చయముగా ఆశ్చర్యకరమే!ఆత్మ స్వరూపియగు దేవుడు సశారీరుడుగా ప్రత్యక్షమైనప్పుడు రక్షకుడని జనములో ప్రకటింపబడెను. 1 తిమోతి 3:16.అదే సమయమున ఆయన తృణికరీంపబడెను, మనుష్యుల వలన విసర్జింపబడేను.యెషయా 53:3.

ఆనాడు మత నాయకులు క్రీస్తును ఆయారితులలో విమర్శించిరి. వడ్లవాని కుమారుడు అని సంబోదించిరి. పాపులు మరియు సుంకరులు స్నేహితుడు, భోజన ప్రియుడు, బయల్జే బుల ద్వారా దయ్యములను వెళ్లగొట్టువాడు, మతిచలించినవాడు అని పరిహరించిరి. ఇది ఇలాగునుండగా ఏమి జరిగేను? “అందుచేత పరలోకమాందున్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రీయైన దేవుని మహిమర్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొను నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించేను “. ఫిలిప్పీ 2:9,10,11

యేసుతో ప్రతి ఉదయము-DAY 36

యేసుతో ప్రతి ఉదయము:-

ఈరోజు దేవుని వాగ్దానము :-

నేనిచ్చు నీళ్లు త్రాగు వాడేయిప్పుడును దప్పి గొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును. యోహాను 4:14

నేను అలసి ఉన్నాను ;ఆ యెఱ్ఱ యెఱ్ఱగా నున్న దానిలో కొంచెం దయచేసి నాకుపెట్టుమని అడిగెను. అదికాండము 25:30

శరీరాశ, నేత్రశ, జీవపుడంభము అనునవి సాతాను యొక్క బలమైన ఆయుధములుగా ఉన్నవి.ఆ దినమున యాకోబు కాలగూర వంతకము వండుకొను చుండగా పొలము నుండి వచ్చిన ఏశావు శోదించబడేను. యాకోబు కుయుక్తిగా -నీ జేష్టత్వము నేడు. నాకు ఇవ్వమని అడిగెను. ఏశావు నోట నుండి వచ్చిన మాటను చుడండి నేను చావబోచున్నాను కదా, జెష్టత్వము నాకెందుకు అనెను “. ఒక పూట తినకపోయినంత మాత్రములో ఎవరు చనిపోరు గాని తన శరీరాశాను బట్టి ఏశావు ఇలాగున మాట్లాడేను. శరీర సంబంధమైన ఆకలి కలిగియుండిన ఏశావునకు ఆత్మ సంబంధమైన ఆకలి ఎంత మాత్రము లేకుండేను.

పూర్తిగా దేవుని మరచి జీవించువారు -నా కొరకు ఏ దీవెన యైనను మిగిల్చి యుంచలేదా అని ఆవేదనతో అడుగుదురు. సాధారణముగా తాతల చరిత్రను మనుమ సంతానమునకు చెప్పుట అనవయితీ. అబ్రాహాము తన సోదరుడు కుమారుడైన లోతును విడిపించుటకు యుద్ధము చేసేను. జయము పొందిన వారు తిరిగి వచ్చుచుండగా సర్వోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కిసేదకు రొట్టెను ద్రాక్షరసమును అబ్రాహామునకు ఇచ్చి ఆశీర్వదించెను. అప్పుడు అబ్రాహాము తన రాబడి అంతటిలో పదియవ వంతు ఇచ్చెను. ఆదికాండము 14:20 బహుశా ఇందును గూర్చి ఏశావు వినియుండవచ్చు.

ONE YEAR BIBLE READING PLAN:-

  1. లెవియకాండము 11-13 అధ్యాయములు

 

యేసుతో ప్రతి ఉదయము

యేసుతో ప్రతి ఉదయము:- Day35
ఈరోజు దేవుని వాగ్దానము:-

యెహోవా నీకు తోడై యున్నాడు. న్యాయధిపతులు 6:12

అంశం :-“బలహీనతలో దైవబలం” (Strength in Weakness)ó

యహోవా దూత అతనికి కనబడి పరక్రమము గల బలడ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనెను.

ప్రారంభములో గిద్యోనును ఒక పిరికివానిగా చుచున్నాము. అతడు మిద్యాని్యులకు మరుగై ఉండునట్లు దుల్లగొట్టుచుండగా దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడెను. దూత సంభోదన -పరాక్రమముగల బలడ్యుడు -గిద్యోను అంగీకారముగా లేదు. అందువలన ఆయన అద్భుత కార్యాములు ఏమయ్యేనని ప్రశ్నించేను

అయితే గిద్యోను బలపరచబడెను. గనుక మూడు వందల మందితోనే అతడు మీద్యాని్యులను జయించేను. శక్తిచేతనైనను కాక బలముచేతనైనను గాక నా ఆత్మ ద్వారా ఇది జరుగును అను గుణపాఠంను దేవుడు గిద్యోనుకు నేర్పేను.

దేవుని బిడ్డలారా, మీరు విదేయత చూపిన కొలది ప్రభువు మీ జీవితములలో ఆశ్చరయ్యకరమైన మలుపులు కలగజేయును. రాత్రి అంతయు ప్రయాసపడినను చేపలు పట్టలేకపోయిన పేతురు బృందము ప్రభువు మాట చొప్పున వలలు వేయగా అవి పిగిలిపోయినంతగా చేపలు దొరికేను. చేపలను పట్టు జాలరిగా నుండిన పేతురు మనుష్యులను పట్టుజాలరిగా మార్చబడెను. ఈ సంఘటన పేతురు జీవితములో మలుపు తెచ్చెను. పేతురు ఆత్మ పూర్ణుడై మాట్లాడినప్పుడు వేల సంఖ్యలో ప్రజలు ప్రభువు తట్టు తిరిగిరి. గిద్యోనును బలపరచిన దేవుడు పేతురును కూడా బలపరచేను. గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గము యెహోవా ఖడ్గము అని అర్భాటించుట ద్వారా వారికి జయము లభించేను. ఇప్పుడు కృపకాలమందు, దేవుని వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గముగా నున్నది. హెబ్రీ 4:12. అది ఆత్మఖడ్గము ఎఫెసీ 6:17

“మిమ్ములను పిలిచిన పిలుపును చూడుడీ”అని మొదలుపెట్టిన పౌలు దేవుడు లోకరితిగా జ్ఞానులను, ఘనులను, గొప్ప వంశపు వారిని పిలువలేదని చెప్పుటయేకాక లోకములో నుండు వెర్రివారు, బలహీనులను, నీచులను, తృణికరీంపబడినవారు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడని స్పష్టముగా వ్రాయుచున్నాడు. 1కొరింది 1:29-29.మనుష్యులు మిమ్మును చూచున్న ప్రకారము, ప్రభువు మిమ్మును చూచుట లేదు. ప్రభువు కనికరము, కృప గొప్ప కార్యములు చేయువారిగా మిమ్మును మార్చుచున్నది.

కథ: శిల్పి మరియు రాయి

​ఒక ఊరి చివర ఒక పగుళ్లు ఉన్న, ఆకారం లేని పెద్ద రాయి పడి ఉంది. వెళ్ళేవాళ్ళంతా ఆ రాయిని చూసి “ఇది దేనికీ పనికిరాదు, దారికి అడ్డంగా ఉంది” అని తిట్టుకునేవారు. కానీ ఒక శిల్పి ఆ రాయిని చూసి, దానిని తన ఇంటికి తీసుకెళ్ళాడు.

​కొన్ని రోజుల పాటు శిల్పి తన ఉలితో ఆ రాయిని చెక్కుతూనే ఉన్నాడు. చివరికి ఆ పగుళ్లు ఉన్న రాయి నుండి ఒక అద్భుతమైన రాజకుమారుడి విగ్రహం బయటపడింది. ప్రజలందరూ ఆశ్చర్యపోయి, “ఇంత అందమైన విగ్రహం ఈ పనికిరాని రాయి నుండి ఎలా వచ్చింది?” అని అడిగారు. అప్పుడు ఆ శిల్పి నవ్వుతూ, “ఈ విగ్రహం రాయిలోనే ఉంది, నేను కేవలం పనికిరాని భాగాన్ని మాత్రమే తొలగించాను” అన్నాడు.

​పాఠం: గిద్యోను తనను తాను పిరికివానిగా చూసుకున్నాడు, కానీ దేవుడు అతనిలో ఉన్న “పరాక్రమవంతుడైన బలఢ్యుడిని” చూశాడు. మన లోపాలను దేవుడు సరిచేసి, తన మహిమ కోసం వాడుకుంటాడు.

​గొప్ప పలుకు (Inspirational Quote)

​”దేవుడు పిలువబడిన వారిని సిద్ధపరచడు, సిద్ధపడిన వారిని పిలవడు; ఆయన ఎంచుకున్న వారిని తానే సిద్ధపరుస్తాడు.”

​ప్రార్థన (Prayer)

​పరిశుద్ధుడైన మా తండ్రి,

నీకు స్తోత్రములు. గిద్యోనును, పేతురును వారి బలహీన స్థితిలో పిలిచి, వారి ద్వారా గొప్ప విజయాలను పొందిన దేవుడవు నీవు. ప్రభువా, ఈ రోజున మేము కూడా అనేకసార్లు మా అశక్తతను చూసి భయపడుతున్నాము. గిద్యోనుకు తోడై ఉన్నట్లు మాకు తోడై ఉండండి. మాకున్న కొద్దిపాటి బలమును నీ ఆత్మ ద్వారా బలపరచండి. లోకపు చూపులకు మేము తృణీకరించబడిన వారముగా ఉన్నా, నీ దృష్టిలో మేము విలువైన వారమని నమ్ముతున్నాము. నీ వాక్యమనే ఖడ్గమును ధరించి, లోకమును జయించే బిడ్డలుగా మమ్మును మార్చమని, మా జీవితాలలో అద్భుతమైన మలుపులు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.

 

 

యేసుతో ప్రతి ఉదయము-DAY 34

యేసుతో ప్రతి ఉదయము :-
ఈరోజు దేవుని వాగ్దానము:-

“నీవు యెహోవా చేతిలో భూషణకిరీటముగాను ,నీ దేవుని చేతిలో రాజకీయమకుటముగాను ఉందువు” యెషయా 62:3

“నాజనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు. గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా వారిని రక్షించును” జెకర్యా 9:16

“జ్ఞానుల ఐశ్వర్యము వారికీ భూషణము” సామెతలు 145:24 .జ్ఞానులు వారిజ్ఞానమును బట్టి అతిశయిస్తారు అది వారి ఐశ్వర్యము గాను భూషణముగాను ఉన్నది .నేనైతే నా దేవుడు అనుగ్రహించి రక్షణను బట్టి అతిశయిస్తాను. లోకములో ఎన్ని ఉన్నను. రక్షణకు మించినది ఏదియు లేదు.
అది ప్రశస్తమైనది.దేవుని చేతిలో నుండి మనలను భూషణకిరీటముగా ,రాజకీయమకుటముగా ఆయన చేసి యున్నాడు.
కిరీటము-రాజకీయ మకుటము అధికారమునకు చిహ్నము.ఆయన నన్ను ఆయన రాజ్య వారసుడుగా/వారసురాలిగా నిన్ను,నన్ను అభిషేకించి యున్నాడు.
తన కుమార్తెలంగా/కుమారుడిగా అంగీకరించి యున్నాడు.విడనాడబడిన దానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీదేశమును గూర్చి చెప్పబడదు. “హెప్సిబా ” అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును.యెషయా 62:4
రక్షణను అనుభవిస్తున్న నీకు,నీకున్న ఈలోక సంబంధులు స్నేహితులు నిన్ను విడనాడావచ్చు అయినను నేను అతిశయిస్తున్నాను.
ఎందుకంటే నా దేవుడు వాగ్దానము యిస్తున్నాడు. విడనాడబడిన దాని వాని నీవు అనుకొనవద్దు బిడ్డ! అని దేవుడు నీతో చెప్పుతున్న మాట నీవు ఆలా పిలువబడవు పాడైనది అని నీదేశమును(కుటుంబమును)గూర్చి చేపబడదు.దేవుడు నీకు క్రొత్త పేరు పెడుతున్నాడు. ‘హెప్సిబ” అని బ్యులా అని నీదేశమునకు (కుటుంబమునకు)పేరు పేట్టుచున్నాడు.